ఆలయంలోకి వెళ్లినందుకు జరిమానా..
By - TV5 Telugu |1 July 2019 2:40 AM GMT
దళితులపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది.. అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఆలయంలోకి వచ్చాడంటూ పెద్దన్న అనే వ్యక్తికి 5వేల రూపాయల జరిమానా విధించారు గ్రామపెద్దలు. అంతే కాదు మళ్లీ గుడిలోకి వస్తే చంపుతామంటూ బెదిరించారు. ఈ ఘటన గ్రామంలో స్వల్ప ఉద్రిక్తతలకు కారణమైంది. దళితసంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పెద్దన్న కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com