ఎమ్మెల్యే vs మాజీ మంత్రి.. కడప జిల్లాలో నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం

ఎమ్మెల్యే vs మాజీ మంత్రి.. కడప జిల్లాలో నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం

కడప జిల్లాలో రాజకీయ విమర్శలు తీవ్ర స్థాయి చేరుకుంటున్నాయి. మైలరవం మండలం గంగానాపల్లి వద్ద ఏర్పాటు చేసిన సోలార్‌ పార్క్‌ను ధ్వంసం చేశారు దుండుగులు. దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన 2 వేల సోలార్‌ ప్యానెళ్ల సామాగ్రిని నాశనం చేశారు. రెండు నెలలుగా... ఈ పార్క్‌కు సంబందించి నియమాకాలు, కాంట్రాక్ట్‌ పనుల విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోంది. జమ్ముల మడుగు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య.... సోలార్‌ పనులకు సంబందించిన వివాదం జరుగుతోంది.

ఇప్పుడు ఈ రెండు వర్గాలకు చెందిన వ్యక్తులకు సంబందించి ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌ పనుల వ్యవహరంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఏకంగా ఆందోళనలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలో... తాజాగా జరిగిన సోలార్‌ ఫ్యానెళ్ల ధ్వంసం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై సోలార్‌ పార్క్‌ నిర్వాహకులు... మహీంద్ర సస్టైన్‌ కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story