శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కత్తుల కలకలం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కత్తుల కలకలం

శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఓ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి వద్ద కత్తులు దొరకడం కలకలం రేపుతోంది. గోల్కొండకు చెందిన కరీముద్దీన్ విమానాశ్రయంలోని ఓమ్ లైన్ సంస్థలో పనిచేస్తున్నాడు. డ్యూటీ కోసం వస్తున్న కరీముద్దీన్ ను భద్రతా సిబ్బంది చెక్ చేసింది. అతడి బ్యాగులో రెండు కత్తులు లభించాయి. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అతడిని వెంటనే పోలీసులకు అప్పగించారు. కరీముద్దీన్ కత్తులతో ఎయిర్ పోర్టులోకి ఎందుకు వచ్చాడన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే కరీముద్దీన్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story