సామాన్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఇస్రో
సామాన్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇస్రో. ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించింది. 10 వేల మంది ప్రజలకు ఈ ఛాన్స్ దక్కబోతోంది. ఇవాల్టి నుంచి ఇస్రో వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకున్న వారికి.. ఆన్లైన్లోనే అనుమతి ఇస్తోంది ఇస్రో.
ఆకాశాన్ని తాకే రాకెట్ లాంచర్...! అందులోంచి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లే రాకెట్..! క్షణ క్షణం ఉత్కంఠ రేపే ప్రయోగం..! ఇలాంటి దృశ్యాలను ఇప్పటి వరకు కేవలం టీవీల్లో మాత్రమే చూశారు. అయితే టీవీల్లో కాకుండా ప్రత్యక్షంగా చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారి కోరికను నెరవేరుస్తోంది ఇస్రో. అదీ కూడా సాదాసీదా ప్రయోగం కాదు. ఏకంగా చంద్రయాన్ -2 ప్రయోగాన్ని.. ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఈనెల 15న ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగం జరగనుంది. ఆ రోజు తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు GSLV-మార్క్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగా న్ని ప్రత్యక్షంగా చూడడానికి 10 వేల మంది ప్రజలకు ఇస్రో అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి ఇవాళ అర్థరాత్రి నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చంద్రయాన్-2 ప్రయోగాన్ని లైవ్లో చూడాలనుకు నేవారు ఇస్రో వెబ్సైట్ WWW.ISRO.GOV.INలో పేర్లను నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్లోనే అనుమతి ఇస్తామని తెలిపింది ఇస్రో.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com