వాటిపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదు - లోకేష్
By - TV5 Telugu |4 July 2019 1:12 AM GMT
జగన్ సర్కారుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు మాజీ మంత్రి లోకేష్. ఏపీ పోర్టుల వ్యవహారంలో జూన్ 28న జారీ అయిన ఆర్టీ -62 జీవో గుట్టు ఎంటోనని ప్రశ్నించారు. ముందు రహస్య జీవో అని చెప్పి రెండ్రోజుల్లోనే ఆ జీవో జారీ చేయబడలేదని మార్చారంటూ ట్వీట్ చేశారు లోకేష్. బందరు పోర్టు గురించి ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని.. సీఎం జగన్.. ఈ జీవోపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు లోకేష్.
సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరమన్నారు లోకేష్. ఇలాంటి పోర్టుపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదన్నారాయన. బందరు పోర్టు ఆంధ్రుల హక్కు అంటూ ట్విట్లో పేర్కొన్నారు లోకేష్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com