వాటిపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదు - లోకేష్

వాటిపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదు - లోకేష్

జగన్‌ సర్కారుపై మరోసారి ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు మాజీ మంత్రి లోకేష్‌. ఏపీ పోర్టుల వ్యవహారంలో జూన్‌ 28న జారీ అయిన ఆర్టీ -62 జీవో గుట్టు ఎంటోనని ప్రశ్నించారు. ముందు రహస్య జీవో అని చెప్పి రెండ్రోజుల్లోనే ఆ జీవో జారీ చేయబడలేదని మార్చారంటూ ట్వీట్‌ చేశారు లోకేష్‌. బందరు పోర్టు గురించి ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని.. సీఎం జగన్‌.. ఈ జీవోపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు లోకేష్‌.

సీమాంధ్రకు పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరమన్నారు లోకేష్‌. ఇలాంటి పోర్టుపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదన్నారాయన. బందరు పోర్టు ఆంధ్రుల హక్కు అంటూ ట్విట్‌లో పేర్కొన్నారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story