వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం

వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం

వేతన జీవుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది కేంద్రం. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. మధ్య తరగతి ఆదాయ వర్గాల ప్రజలు పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల నుంచి కనీసం 3 లక్షలకు పెంచుతారాని ఆశలు పెట్టుకున్నారు. కానీ మరోసారి మొండిచేయే చూపించింది కేంద్రం...ఐదేళ్ల కిందట 2014-15లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపును 2 లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. అప్పటి నుంచి వేతనజీవులను ఊరిస్తూ వస్తున్న కేంద్రం మళ్లీ నిరాశే మిగిల్చింది..అయితే పన్ను పడే ఆదాయం 5 లక్షల దాకా ఉన్నవారికి మాత్రం మినహాయింపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story