రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త
By - TV5 Telugu |6 July 2019 1:24 PM GMT
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది. మధ్యంతర భృతి 27 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జులై నుంచి కొత్త ఐఆర్ వర్తించనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ సంఘాలు ఐఆర్ పెంచమని కోరాయి. దీనిపై సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన తొలి కేబినెట్ భేటీలో చర్చించారు. ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఇవాళ ఉత్తర్వులు వెలువడ్డాయి. జీవో జారీతో ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియచేశాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com