ఇంటికొస్తే పాస్మార్కులు పక్కా.. బాసర ట్రిపుల్ ఐటీలో..
బాసర ట్రిపుల్ ఐటీలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సాగించిన కీచక పర్వం సంచనలం రేపుతోంది. గత కొంత కాలంగా పాస్ మార్కులు వేయిస్తానని ఆశ చూపి.. బాలికలపై అత్యాచారానికి తెగబడుతున్నాడు ప్రొఫెసర్ రవి. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులే టార్గెట్గా తన కీచక పర్వానికి తెరలేపాడు. అంతే కాదు తన లైంగిక కోరిక తీర్చిన విద్యార్థినిలకు పేపర్ లీక్ చేయడంతో పాటు ఇంట్లోనే పరీక్షలు నిర్వహించేవాడు. ఇంట్లో వారిని బయటకు పంపించి అక్కడే విద్యార్థునిలపై అత్యాచారం పాల్పడేవాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో బాధిత విద్యార్థులు ఉన్నట్లు తేలడం కలకలం రేపుతోంది.
బాలికల హాస్టల్ భవనంలోనే సదరు ప్రొఫెసర్ రవి చాంబర్ కూడా ఉంది. ఇంకేముంది మరింత రెచ్చిపోయేవాడు. తన చాంబర్కు విద్యార్ధినిలను పిలుపించుకుని బలత్కారం చేసేవాడు. ఇలా గత కొన్నాళ్లుగా రవి దారుణాలు కొనసాగాయి. తాజాగా ఓ విద్యార్ధినితో రవి చేసిన ఫోన్ చాటింగ్తో కీచక అధ్యాపకుడి బండారం బట్టబయలైంది. ఇంటికి వస్తే పాస్ చేయిస్తానంటూ విద్యార్థినితో చాట్ చేశాడు. సదరు విద్యార్ధిని అధికారులకు ఫిర్యాదు చేయడంతో... అతనిపై చర్యలకు పూనుకున్నారు. ప్రస్తుతం దీనిపై నిజనిర్ధారణ కమిటీ వేసి విచారణ చేస్తున్న అధికారులు.. ప్రొఫెసర్ రవిని సస్పెండ్ చేశారు. బయటకు చెబితే ఎక్కడ కెరీర్ నాశనం అవుతుందోననే భయంతో...అసిస్టెంట్ ఫ్రొఫెసర్ రవి చేష్టలను మౌనంగా భరించారు విద్యార్ధినిలు.
కీచక ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు నిరసనగా విద్యార్థి, మహిళా సంఘాలు ఆందోళన బాట పట్టాయి. విద్యార్థిణిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కెమెస్ట్రీ ప్రొఫెసర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని క్యాంపస్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగాయి విద్యార్థి, మహిళా సంఘాలు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇలాంటి ఘటనలపై గత కొన్నేళ్లుగా ఆరోపణలు వస్తున్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com