గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ

గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ

గవర్నర్‌ నరసింహన్‌తో ఏపీ సీఎం జగన్‌ భేటీ అయ్యారు. విజయవాడకు వచ్చిన గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలు ఈనెల 11 నుంచి మొదలుకానున్నాయి. 12న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయింపులు, ప్రాధాన్యాలు, ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ తదితర అంశాలపై జగన్‌ గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న విషయాన్ని జగన్, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు నిధుల కేటయించకపోవడం, ఏపీ, తెలంగాణ మధ్య విభజన చట్టంలోని పలు సమస్యల పరిష్కారం తదితర అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story