హిజ్రా గర్భం దాల్చలేదని నిర్ధారించిన వైద్యులు.. అర్థరాత్రి సమయంలో..

X
By - TV5 Telugu |9 July 2019 5:13 PM IST
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో హిజ్రా అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. వెంకట్రెడ్డి వల్ల తాను గర్భం దాల్చానంటూ హిజ్రా పూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హిజ్రాకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గర్భం దాల్చలేదని నిర్ధారించారు.
సోమవారం అర్ధరాత్రి సమయంలో పురుగుల మందు తాగి హిజ్రా పూర్ణ ఆత్మహత్య చేసుకుంది. అయితే మృతికి వెంకటరెడ్డే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com