యువతిని లాడ్జికి పిలిచి యువకుడు చేసిన పని..
By - TV5 Telugu |9 July 2019 11:19 AM GMT
హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. యువతి గొంతుకోసిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. మంగళవారం ఉదయం చైతన్యపురి లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు నెల్లూరు వాసి వెంకటేష్. హైదరాబాద్కు చెందిన మనస్వినిని లాడ్జికి పిలిచాడు. ఆ తర్వాత మనస్విని గొంతుకోసి.. కత్తితో చేతులు కోసుకున్నాడు వెంకటేష్. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనస్విని.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల చెప్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com