భారత్‌తో ఆడుకుంటున్న వరుణుడు.. 5 పరుగులకే మూడు వికెట్లు..

భారత్‌తో ఆడుకుంటున్న వరుణుడు.. 5 పరుగులకే మూడు వికెట్లు..

మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో వరుణుడు భారత్‌తో ఆడుకుంటున్నాడు. వర్షం ప్రభావంతో పిచ్‌ స్వింగ్‌కు పూర్తిగా సహకరిస్తోంది. దీంతో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. 5 పరుగులకే టాప్‌ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరుకున్నారు. రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌ తలా ఓ పరుగు మాత్రమే చేసి అవుటయ్యారు. అంతా ఊహించినట్లుగానే న్యూజిలాండ్‌ బౌలర్లు హెన్లీ, బౌల్ట్‌ నిప్పులు చెరుగుతున్నారు. హెన్రీకి రెండు వికెట్లు, బౌల్ట్‌కు ఒక వికెట్‌ దక్కింది.

Tags

Read MoreRead Less
Next Story