32 ఇంచుల ఆండ్రాయిడ్ టీవీ రూ.13,999లకే.. ఫీచర్లు చూస్తే..
By - TV5 Telugu |10 July 2019 8:44 AM GMT
దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ మైక్రో మ్యాక్స్ భారత్లో నూతన ఆండ్రాయిడ్ టీవీ మోడల్స్ను విడుదల చేసింది. దీన్ని గూగుల్ సర్టిఫై చేయడం విశేషం. కాగా 32 ఇంచుల ఈ టీవీ ధర రూ.13,999 లకే విక్రయిస్తున్నారు ప్లిప్కార్ట్లో. రేపటి నుంచి విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. 32 ఇంచుల డిస్ప్లే మొదలుకొని 43 ఇంచుల డిస్ప్లే వరకు లభిస్తున్నాయి. కాగా ఈ టీవీల్లో గూగుల్ ప్లే స్టోర్కు సపోర్ట్ను అందిస్తున్నారు. అలాగే బిల్టిన్ క్రోమ్క్యాస్ట్ ఫీచర్ను వీటిల్లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ను కూడా ఈ టీవీల్లో అందిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com