జగన్ విమర్శలకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్
ప్రాజెక్టులపై సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య వాడివేడి చర్చసాగింది. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లారంటూ టీడీపీ చేసిన విమర్శలకు జగన్ సమాధానం ఇచ్చారు. తాను వెళ్లినా.. వెళ్లకపోయినా... ప్రారంభోత్సవం జరిగేదన్నారు. ఐదేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు .. అక్కడ కేసీఆర్ కాళేశ్వరం కడుతుంటే గాడిదలు కాశారా అంటూ విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఆల్మట్టి ఎ్తతు పెంచారని సీఎం ఆరోపించారు. ఇప్పుడు గోదావరి నీళ్లతో.. కృష్ణా ఆయకట్టును స్థిరీకరించే ప్రయత్నం చేస్తుంటే దాన్ని కూడా తెలుగుదేశం విమర్శిస్తోందని మండిపడ్డారు జగన్.
జగన్ విమర్శలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ వయస్సు తన రాజకీయ అనుభవం అంత లేదన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే.. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు భారత్- పాక్ లా మారిపోతాయని జగన్ అన్నాడంటూ గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళ్లిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. తెలంగాణ భూభాగంలో ప్రాజెక్టులు కడతామని అంటున్నారు. రేపు ఆ నీళ్లు మావే అని తెలంగాణ అంటే ఏం చేస్తారని జగన్ ని ప్రశ్నించారు చంద్రబాబు. గోదావరి నీళ్లు శ్రీశైలంకు తీసుకెళ్లడంపై చర్చ జరగాలన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com