ఎస్బీఐ ఖాతాదారులకు పండగలాంటి వార్త..
By - TV5 Telugu |12 July 2019 10:20 AM GMT
ప్రభుత్వ రంగ బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'(ఎస్బీఐ) తన వినియోగదారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అని వేళలా జరిపే ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపై ప్రస్తుతం విధిస్తున్న చార్జీలను ఎత్తేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్, అలాగే వివిధ యాప్ లద్వారా లావాదేవీలు జరిపే ఖాతాదారులకు ఊరట లభించినట్లయింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com