ఇంటర్ స్టూడెంట్‌పై కన్నేసి.. పదిరోజుల పాటు..

ఇంటర్ స్టూడెంట్‌పై కన్నేసి.. పదిరోజుల పాటు..

ఇంటి పక్కనే ఉండే ఇంటర్ స్టూడెంట్ పై కన్నేశాడు ఓ నీచుడు. మత్తుమందు ఇచ్చి తనతో పాటు బెంగళూరు తీసుకెళ్లాడు. పది రోజులు ఆమెపై అత్యాచారానికి తెగబడిన ఆ కిరాతకుడు.. కోరిక తీరిన తర్వాత బాలికను ఆమె ఇంటి ముందు వదిలి వెళ్లిపోయాడు. విషయం తెల్సుకున్న ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనంతపురం జిల్లా కూడేరు మండలానికి చెందిన మైనర్ బాలిక అనంతపురంలోని ఎస్వీ జూనియర్ కాలేజీలో జూనియర్ ఇంటర్ చేస్తోంది. ఆమె ఇంటి పక్కనే ఉండే గణేష్ ఆమెపై కన్నేశాడు. ఈ నెల రెండో తేదిన ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని వస్తున్న బాలికను గణేష్ అతని స్నేహితుల సాయంతో కిడ్నాప్ చేశాడు. బెంగళూరులో నిర్బంధించి అత్యాచారానికి తెగబడిన అతను.. శుక్రవారం సాయంత్రం ఆ మైనర్ బాలికను ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. కిడ్నాపైన కూతురు పది రోజుల తర్వాత కనిపించే సరికి సంతోషపడిన తల్లిదండ్రులు.. అసలు విషయం తెల్సుకొని ఆగ్రహాంతో రగిలిపోతున్నారు.

మైనర్ పై అత్యాచారానికి తెగబడిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడి బంధువులు తమపై దాడి చేసేందుకు వస్తున్నారని.. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. నిందితునిపై పోక్సో చట్టం కింది కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నలుగురిని నిందితులుగా గుర్తించామంటున్న పోలీసులు.. ఆదివారంలోగా అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story