ప్రజావేదికను కూల్చడం సరైంది కాదు : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

X
By - TV5 Telugu |17 July 2019 3:33 PM IST
అక్రమ కట్టడం పేరుతో ప్రజావేదికను కూల్చడం సరైంది కాదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. గత ప్రభుత్వం చేసిన తప్పునే జగన్ సర్కార్ చేసిందన్న భావన ప్రజల్లో నెలకొందని విమర్శించారు. ప్రజావేదికపై కొంత సమయం తీసుకుని దానిని మరో ప్రాంతానికి తరలించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. కూలగొట్టడం ద్వారా నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాధవ్..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com