తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్‌ కు బాలికలను తరలిస్తూ..

తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్‌ కు బాలికలను తరలిస్తూ..

తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్‌ కు బాలికలను తలరిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారంతో ఖమ్మంలో నవ‌ జీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో సోదాలు చేయగా... బాలికల వ్యవహారం వెలుగుచూసింది. మొత్తం 16 మంది బాలికలను తరలిస్తున్నట్టు గుర్తించారు. వారందరినీ అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్ కు వీరిని పనుల కోసం తీసుకెళుతున్నట్టు గుర్తించారు. బాలికలు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలికల వివరాలు తీసుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story