కుమారస్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఆగ్రహం

కుమారస్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఆగ్రహం

అసెంబ్లీలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ మధ్య వివాదం చోటు చేసుకుంది. తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ కాపాడుకోలేకపోయిందని సీఎం కుమారస్వామి విమర్శించారు. అయితే కుమారస్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదారు కోట్లు ఆఫర్‌ చేస్తుంటే ఎలా కాపాడుకుంటామని అన్నారు కాంగ్రెస్‌ సభ్యులు.

రెబల్‌ ఎమ్మెల్యేలపై అటు స్పీకర్‌ రమేష్‌ కుమార్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సంపాదించినా జానెడు పొట్ట కోసమే అన్న స్పీకర్‌...దాని కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తారా అని రెబల్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story