భార్య కొట్టిన దెబ్బలకు తాళలేక మృతి చెందిన భర్త

భార్య కొట్టిన దెబ్బలకు తాళలేక మృతి చెందిన భర్త

దంపతుల మధ్య మాటామాటా పెరిగింది. చివరికి ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. పట్టరాని కోపం ఊగిపోయిన భార్య కర్రతో భర్త తలపై విపరీతంగా కొట్టింది. ఈ దాడిలో భర్తకు తీవ్ర రక్తస్రావమైంది. భార్య కొట్టిన దెబ్బలకు తాళలేక భర్త స్పాట్‌లోనే కన్నుమూశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో జరిగింది.

కట్టుకున్న భార్యే భర్తను చంపడం స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే భార్యకు మతిస్థిమితం లేదని బంధువులు, స్థానికులు అంటున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story