అసెంబ్లీలో మాటల యుద్ధం.. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

X
By - TV5 Telugu |23 July 2019 10:54 AM IST
మేనిఫెస్టోలో హామీలు, పెన్షన్లపై ఏపీ అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో.. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు సస్పెన్షన్కు గురయ్యారు. ముగ్గురు టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను సెషన్ అంతా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. హామీల విషయంపై అధికారపక్షాన్ని టీడీపీ సభ్యులు నిలదీశారు. పెన్షన్లపై అధికార, విపక్షాల మధ్య పదేపదే వాగ్వాదం జరిగింది. సభలో అధికార పక్షం వీడియో ప్లే చేసినప్పుడు తాము ఇచ్చే వీడియో సాక్ష్యం కూడా ప్లే చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఇరువర్గాల మధ్య మాటకుమాట పెరగడంతో సభలో గందరగోళానికి దారి తీసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com