ఉపాధ్యాయుడిపై కత్తితో దాడి చేసిన యువకుడు

ఉపాధ్యాయుడిపై కత్తితో దాడి చేసిన యువకుడు

తరచూ నలుగురిలో మందలిస్తున్నాడని ఆగ్రహానికి గురైన ఓ యువకుడు.. ఉపాధ్యాయుడిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలులో కలకలం రేపింది. వీరవెంకట సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు తరచూ మందలిస్తున్నాడని విన్సెంట్‌ అనే యువకుడు దాడికి దిగాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్రస్తుతం బాధిత ఉపాధ్యాయుడు అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story