ఉపాధ్యాయుడిపై కత్తితో దాడి చేసిన యువకుడు
By - TV5 Telugu |23 July 2019 4:18 AM GMT
తరచూ నలుగురిలో మందలిస్తున్నాడని ఆగ్రహానికి గురైన ఓ యువకుడు.. ఉపాధ్యాయుడిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలులో కలకలం రేపింది. వీరవెంకట సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు తరచూ మందలిస్తున్నాడని విన్సెంట్ అనే యువకుడు దాడికి దిగాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్రస్తుతం బాధిత ఉపాధ్యాయుడు అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com