అమిత్షా, విజయసాయిరెడ్డిలతో ఐఏఎస్ శ్రీలక్ష్మి భేటీ
By - TV5 Telugu |23 July 2019 11:06 AM GMT
సీనియర్ IAS అధికారిణి శ్రీలక్ష్మి... కేంద్ర హోమంత్రి అమిత్షాతో భేటీ అయ్యారు. కొంతకాలంగా ఏపీలో పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్న శ్రీలక్ష్మి... ఇదే అంశంపై అమిత్షాను కలిసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇక అంతకుముందు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో శ్రీలక్ష్మి భేటీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో క్యాడర్లో పనిచేస్తున్న శ్రీలక్ష్మి బదిలీ కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఏపీలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న తరుణంలో కేంద్రం నుంచి అనుమతి కోసం ఆమె ఎదురుచూస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com