నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించిన విద్యార్థులు

నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించిన విద్యార్థులు

చెన్నైలో కాలేజీ స్టూడెంట్స్ రౌడీ మూకల్లా చెలరేగిపోయారు. నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. ముగ్గురు విద్యార్ధులు నడిరోడ్డులో కత్తులతో దాడికి దిగటంతో జనం బెంబేలెత్తిపోయారు. బస్సులో ఉన్న వ్యక్తులను కిందకు దించి మరీ దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో ఇద్దరు పరుగెత్తి తప్పించుకోగలరు. ఓ విద్యార్ధికి మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి.

పచ్చయాప్పన్ కళాశాలలో ఇద్దరు స్నేహితుల మధ్య మనస్పర్థలు రావటంతో దాడికి కారణంగా తెలుస్తోంది. చెన్నైలోని అరంబాక్కం సిగ్నల్ దగ్గర బస్సు ఆపి మరీ కత్తులతో దాడికి ప్రయత్నించారు. బుక్స్ పట్టుకోవాల్సిన కాలేజీ స్టూడెంట్స్ కత్తులతో రౌడీ షీటర్లను మించి పోయారు. బస్సులో నుంచి కిందకు లాగీ కత్తితో దాడి చేయబోయారు. దీంతో బస్సులోని ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

నడిరోడ్డుపై కత్తులతో బీభ్సతం సృష్టించిన ముగ్గురు విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story