గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసిన విపక్ష నేత చంద్రబాబు

X
By - TV5 Telugu |25 July 2019 8:44 PM IST
ఏపీ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను విపక్ష నేత చంద్రబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు తొలిసారి భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. అసెంబ్లీ జరుగుతున్న తీరు.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు గవర్నర్తో చర్చించినట్టు తెలుస్తోంది.. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, మాణిక్య వర ప్రసాద్, అశోక్ బాబు గవర్నర్ను కలిశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com