వ్యక్తి పై పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు
By - TV5 Telugu |25 July 2019 2:46 AM GMT
హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో.. దారుణం జరిగింది. రవి అనే వ్యక్తిని.. పెట్రోలు పోసి తగలబెట్టారు దుండగులు. అతని మృతదేహాం.. యాచరంలోని చెట్ల పొదల్లో లభ్యమైంది. అయితే.. బిచ్చనాయక్ అనే వ్యక్తి ఈ హత్య చేశాడంటున్నారు రవి కుటుంబసభ్యులు. బిచ్చనాయక్ రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నాడని , ఆ డబ్బు ఇస్తానని రవిని తీసుకెళ్లి చంపేశాడంటున్నారు. తమకు న్యాయం చేయాలంటున్నారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com