మిసైల్ పరీక్షలకు దిగిన నార్త్ కొరియా
By - TV5 Telugu |26 July 2019 6:14 AM GMT
ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. రెండు స్వల్పశ్రేణి మిసైళ్లను నార్త్ కొరియా పరీక్షించింది. వోన్సన్ పట్టణంలో ఈ పరీక్ష జరిగింది. సుమారు 430 కిలోమీటర్లు ప్రయాణించిన మిస్సైళ్లు.. తూర్పు సముద్రంలో పడినట్లు సమాచారం. ఐతే, ఆ క్షిపణులు జపాన్ జలాల్లోకి రాలేదని జపాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వచ్చేనెలలో దక్షిణ కొరియా-అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. సైనిక ప్రదర్శనను ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా-దక్షిణ తీరుపై మండిపడుతున్న నార్త్ కొరియా, మిసైల్ పరీక్షలకు దిగింది. ఆ జంట మిస్సైళ్లు K.N-23S అయి ఉంటాయని రక్షణవర్గాలు పేర్కొన్నాయి. K.N-23S క్షిపణులు అణ్వాయుధాలను మోసుకు వెళ్లగలవని సమాచారం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com