ఏమిటీ రౌడీ రాజ్యం : చంద్రబాబు ఫైర్

X
By - TV5 Telugu |27 July 2019 9:59 PM IST
వైసీపీ ప్రభుత్వంపై మరో సారి ఫైర్ అయ్యారు ప్రతిపక్షనేత చంద్రబాబు. చిరుద్యోగుల ఉసురు పోసుకోంటోందని మండిపడ్డారు. నిన్న ఆశా వర్కర్లు, ఈరోజు ఫీల్డ్ అసిసెంట్లను తీసివేస్తోందని .. ఏమిటీ రౌడీ రాజ్యం అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వైసీపీ వాళ్లకు ఉద్యోగాలివ్వాలంటే ఇంకొకరి ఉద్యోగాలను పీకేయాలా అని దుయ్యబట్టారు. కొత్త ఉద్యోగాలను సృష్టించే సమర్థత లేనప్పుడు ప్రజలకు ఏం చేద్దామని ఉద్యోగాల హామీలిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు . చిరుద్యోగుల ఆవేదనకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com