బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ కేసులో పురోగతి

హైదరాబాద్ శివారు హయత్‌నగర్‌లో కిడ్నాపైన బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఐతం రవిశేఖర్ కుమారుడు ఐతం రాజు, అతడి అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని ఓ రహస్య ప్రదేశంలో వీరిద్దరినీ ఏపీ, తెలంగాణ పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

సోనీ కిడ్నాపై ఐదు రోజులు గడుస్తున్నా ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సోనీని నిందితుడు రవిశేఖర్ కర్నూలు వైపు తీసుకువెళ్లినట్టు గుర్తించిన పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు.కర్ణాటకలో కారును దొంగిలించిన రవిశేఖర్ దానిలోనే హైదరాబాద్ వచ్చి సోనీని కిడ్నాప్‌ చేశాడు. కారు నంబర్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. మొత్తం ఐదు బృందాలు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలోనూ గాలింపు చేపట్టాయి.

Tags

Read MoreRead Less
Next Story