బోనాల సంబరాలతో వెలిగిపోతోన్న భాగ్యనగరం
బోనాల సంబరాలతో భాగ్యనగరం వెలిగిపోతోంది.. పాతబస్తీ ఆధ్మాత్మికశోభను సంతరించుకుంది. లాల్ దర్వాజ బోనాల జాతర సందడిగా సాగుతోంది. సింహవాహినిగా వేంచేసిన మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించుకుంటున్నారు.. భక్తుల మొక్కులు, శివసత్తులు, పోతురాజుల విన్యాసాలతో పాతనగరం సందడిగా మారింది. మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు, నైవేద్యం సమర్పించేందుకు బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు..
అక్కన్న, మాదన్న దేవాలయాలతోపాటు అన్ని చోట్ల ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి.. అటు రేపు రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తర్వాత భవానీ రథయాత్ర జరుగుతుంది.. మరోవైపు మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు.. ఓల్డ్ సిటీలో బోనాలకు జీహెచ్ఎంసీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com