ఈ బాలుడు ఎవరు..? ఎవరు వదిలివెళ్లారు..?

ఈ బాలుడు ఎవరు..? ఎవరు వదిలివెళ్లారు..?

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో స్థానికులు గుర్తించిన బాలుడు ఎవరు..? అక్కడ బాలుణ్ని ఎవరు వదిలివెళ్లారు..? దీనిపై పోలీసులు ఓ వైపు దర్యాప్తు చేస్తుండగానే.. ఓ మహిళ ఆ బిడ్డ తన బిడ్డేనంటూ వచ్చింది.. జన్మనిచ్చిన తల్లిని తానేనని చెబుతోంది.. తన కొడుకును చూపించాలంటూ ఏలూరు పోలీసులను ఆశ్రయించింది. అయితే.. బాబు తండ్రిని తానే అంటూ ఇప్పటికే ఓ వ్యక్తి రావటంతో ఇన్నారిని ఆ మహిళకు అప్పగించేందుకు నిరాకరించారు పోలీసులు. తగిన సాక్ష్యాలతో రేపు రావాలని చెప్పారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 20 నెలల బాలుడు గత పది రోజులుగా శిశు సంరక్షణ గృహంలో ఉన్నాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎవరో తెల్సుకొని బాబును అప్పగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాబు తన కొడుకే అంటూ సుష్మ అనే మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాబు పేరు రాజేష్ అని చెబుతోందామె. రాజేష్ ను తమ సన్నిహితుడైన ఉమామహేశ్వరరావుకు అప్పగించి వేరే పని మీద వెళ్లానని..ఈలోగా బాబు పోలీసుల సంరక్షణలో ఉన్నాడని తెలిసినట్లు సుష్మ చెబుతోంది. అయితే..బాబు నిజంగా ఆమె కొడుకే అయితే 10 రోజులుగా ఆచూకీ కోసం ఎందుకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story