టాప్ ఇండియన్ బాక్సర్ మేరికోమ్ ఖాతాలో మరో మెడల్
By - TV5 Telugu |28 July 2019 2:34 PM GMT
టాప్ ఇండియన్ బాక్సర్ మేరికోమ్ ఖాతాలో మరో మెడల్ పడింది. ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నీలో మేరీ కోమ్ గోల్డ్ మెడల్ సాధించింది. మహిళల 51 కిలోల విభాగంలో మేరీకోమ్ స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైన ల్లో ఆస్ట్రేలియన్ బాక్సర్ ఫ్రాంక్స్తో జరిగిన పోరులో మేరీ కోమ్ 5-0 తేడాతో విజయం సాధించింది. సెమీ ఫైనల్లో వియత్నాంకు చెందిన కిమ్తో పోరాడి గెలిచిన మేరీ, ఫైనల్లో మాత్రం అలవోకగా విజయం సాధించింది.
మేరీకోమ్, బాక్సింగ్లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచింది. ఈ ఏడాది మేలో జరిగిన భారత ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్లోనూ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లోనూ పతకాలు సాధించి సత్తా చాటింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com