నిండు గర్భిణి ప్రాణం తీసిన భర్త

నిండు గర్భిణి ప్రాణం తీసిన భర్త

కుటుంబ కలహాలు ఓ గర్భిణి ప్రాణం తీశాయి. కట్టుకున్న భర్తే ఆ గృహిణికి కాలయముడయ్యాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎన్టీఆర్‌ నగర్‌లో జరిగింది. మహబూబ్‌ బాషా, ఉసేన్‌ బీకి 8 నెలల క్రితం వివాహం జరిగింది. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో భార్య ఉసేన్‌ బీని గొంతు నులిమి చంపాడు భర్త. 3 నెలల గర్భవతని కూడా చూడకుండా హత్యచేయడం స్థానికుల్ని కలచివేసింది. భార్యను చంపాక తాను కూడా కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బాషాని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story