ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు.. టైర్లపై ప్రయాణం..

X
By - TV5 Telugu |29 July 2019 9:04 PM IST
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు నీట మునగడంతో నీటిలోనే ప్రయాణం చేస్తున్నారు గిరిజనులు. ప్రమాదకర స్థితిలో టైర్లపై ప్రయాణం చేస్తున్నారు. ఏజెన్సీ అడ్డతీగల మండలంలోని పనుకురాతి పాలెం, పింజరికొండ కొత్తపాలెంలో వాన కాలం వస్తే పెద్దేరు వాగు దాటాల్సిందే. వాగులు దాటుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు గిరిజనులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com