హోదాను మరచి ఓ యాత్రికుడి కాళ్లకు మసాజ్ చేసిన జిల్లా ఎస్పీ
By - TV5 Telugu |29 July 2019 11:41 AM GMT
ఉత్తరప్రదేశ్లో కాన్వార్ యాత్ర జరుగుతోంది. ఈ యాత్రకు వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం షాప్లీలో నేచురోపతి క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ అజయ్కుమార్ను ఆహ్వానించారు. అయితే.. ఎస్పీ తన హోదాను పక్కనబెట్టి ఓ సాధారణ వ్యక్తిలా మారి ఓ యాత్రికుడి కాళ్లకు మసాజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ips అధికారి తన హోదాను మరచి యాత్రికుడి కాళ్లకు మసాజ్ చేయడం పట్ల పోలీస్ ఉన్నతాధికారులు అజయ్కుమార్కు అభినందనలు తెలుపుతున్నారు.
Shamli SP Ajay Kumar giving therapy to Kawariya at one of the makeshift health/medical centres in the district. pic.twitter.com/Tou8fJu01M
— Piyush Rai (@Benarasiyaa) July 26, 2019
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com