భార్యను కాపురానికి తీసుకెళ్లని భర్త.. ఆగ్రహంతో యువతి బంధువులు..

భార్యను కాపురానికి తీసుకెళ్లని భర్త.. ఆగ్రహంతో యువతి బంధువులు..

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో దాడులు చేసుకోవడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జోయా అనే యువతిని తన భర్త 6 నెలల నుండి కాపురానికి తీసుకెళ్లలేదు. దీంతో ఎందుకు కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ యువతి బంధువులు.. ఆమె భర్త ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువతి భర్త, బంధువులు కత్తులతో దాడికి దిగారు. జోయా అన్న సలీం, చిన్నాన్న ఫక్రుద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story