వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగను వెనక్కి వెళ్లాలంటూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ఘాటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదని ఎగతాళి చేశారని.. కానీ ఈ రోజు స్పిల్వేలో ఉండే రివర్స్ స్లుయీజ్ గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని మళ్లించారని ట్వీట్ చేశారు చంద్రబాబు. అవహేళనలను, ఆరోపణలని ఎదుర్కొంటూనే 70 శాతం నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. ఇంత చేసిన మిగిలిన 30 శాతం పూర్తి చేయకపోతే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందన్నారు చంద్రబాబు. వరద సమయంలో ప్రాజెక్టు కోసం పని చేస్తున్న కంపెనీలకు వెనక్కు వెళ్లిపోవాలి అంటూ నోటీసులు ఇచ్చారని.. దీన్ని బట్టే ప్రాజెక్టు నిర్మాణం పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి, దూరదృష్టి ఏపాటిదో అర్థం అవుతోందన్నారు టీడీపీ అధినేత.
వరద సమయంలో ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న కంపెనీలకు, 'వెనక్కు వెళ్లిపోవాలి' అంటూ నోటీసులు ఇచ్చారంటే, ప్రాజెక్ట్ నిర్మాణం పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి, దూరదృష్టి ఏపాటిదో అర్థం అవుతోంది.
— N Chandrababu Naidu (@ncbn) August 1, 2019
పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదన్న వాళ్ళు, ఈరోజు స్పిల్ వేలో ఉండే రివర్స్ స్లుయీజ్ గేట్ల ద్వారా 2లక్షల క్యూసెక్కుల వరద నీటిని మళ్లించారు. అవహేళనలని, ఆరోపణలని ఎదుర్కొంటూనే 70శాతం నిర్మాణం పూర్తిచేసాం. ఇంతాచేసినా మిగిలిన 30శాతం పూర్తి చేయకపొతే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుంది. pic.twitter.com/ZICPBtp55O
— N Chandrababu Naidu (@ncbn) August 1, 2019
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com