వన్ అండ్ వోన్లీ.. వన్‌ప్లస్.. మార్కెట్లో దానిదే హవా

వన్ అండ్ వోన్లీ.. వన్‌ప్లస్.. మార్కెట్లో దానిదే హవా

దేశీయ మొబైల్ మార్కెట్లో చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్ అగ్రగామిగా నిలుస్తోంది. ప్రీమియం సెగ్మెంట్ మోడళ్లలో యాపిల్, శాంసంగ్‌‌కు ఉన్న షేర్లను పక్కన పెట్టి పైపైకి పోతున్నాయి వన్‌ప్లస్ షేర్లు. లాభాల బాట పయనిస్తున్నాయి. ఈ ఏడాది దేశంలోకి దిగుమతి అయిన మొత్తం ప్రీమియం ఫోన్లలో 43 శాతం వన్‌ప్లస్‌వే అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజాగా వెల్లడించింది. 22 శాతం షేరుతో కొనసాగుతున్న దక్షిణకొరియా దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్ రెండో స్థానంలో ఉంటే 18 శాతం షేర్‌తో యాపిల్ మూడో స్థానంలో ఉంది. ఇక వన్‌ప్లస్ నుంచి వచ్చిన ఆల్డ్రా ప్రీమియం ఫోన్ వన్‌ప్లస్ 7 ప్రోకు భారత మార్కెట్లో విశేషాదరణ లభిస్తోంది. దిగుమతి అయిన మొత్తం వన్‌ప్లస్ ఫోన్లలో 26 శాతం 7 ప్రో మోడల్ ఫోన్లే అని కౌంటర్ పాయింట్ పేర్కొంది. ఇక శాంసంగ్‌లో ఎక్కువగా ఎస్ 10 ప్లస్ ఫోన్లు దిగుమతి అయినట్లు తెలిపింది. మొబైల్ మార్కెట్లో మరికొన్ని కొత్త మోడళ్ల ఫోన్లు.. షావోమీ, ఒప్పో, వివో హువావే కూడా ప్రీమియం సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టడంతో పోటీ విపరీతంగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story