ముగ్గురు యువకులపై ఆరుగురు వ్యక్తుల దాడి
By - TV5 Telugu |2 Aug 2019 11:23 AM GMT
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ముగ్గురు యువకులు మరో ఆరుగురు యువకులు దాడి చేయడం కలకలం రేపుతోంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర తనను వేధించారని.. ఓ యువతి కుటుంబ సభ్యులకు చెప్పగా.. వెంటనే ఆరుగురు యువకులు.. బస్టాండ్ దగ్గర ఉన్న ముగ్గురు యువకులను ఓ జామాయిల్ తోటలోకి లాక్కెళ్లి చితకబాదారు. విచాక్షణ రహితంగా కొట్టారు. చిత్రహింసలకు గురి చేశారు. తాము ఏ తప్పు చేయలేదని ప్రాధేయపడుతున్నా వారు కనికరించకుండా చావబాదారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com