శునకాల దాడిలో 100 గొర్రెలు మృతి

శునకాల దాడిలో 100 గొర్రెలు మృతి

శునకాల గుంపు 100 గొర్రెలపై దాడిచేసి చంపేశాయి. దీంతో గొర్రెలే తమ జీవనాధారంగా బతుకుతున్న కాపరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడలో చోటు చేసుకుంది. కొట్టంలో ఉంచిన గొర్రెల మందపై 10 శునకాలు దాడి చేసి చంపాయని కాపరులు తెలిపారు. గొర్రెల మృతితో రూ. 6లక్షల వరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story