జాగ్వార్ కొనమంటే బీఎండబ్ల్యూ కొంటావా.. ఏం చేస్తానో చూడు.. పుత్రరత్నం నిర్వాకం

జాగ్వార్ కొనమంటే బీఎండబ్ల్యూ కొంటావా.. ఏం చేస్తానో చూడు.. పుత్రరత్నం నిర్వాకం

చిన్నప్పుడు అడిగిందల్లా కొనిచ్చాడు నాన్న. మరి పెద్దైన తరువాత మాత్రం ఎందుకు కాదంటున్నాడు. అందుకే నాకు నచ్చని కారుని నదిలో పడేస్తున్నానంటూ 35 లక్షల విలువ చేసే కారుని నదిలోకి తోసి పడేశాడు పుత్రరత్నం. హరియాణాలోని యమునా నగర్‌కు చెందిన భూస్వామి కుమారుడు తనకు జాగ్వార్ కారు కొనివ్వమని తల్లిదండ్రులను అడిగాడు. కొడుకు కారు అడిగాడు.. కాదనలేక పోయాడు కోటీశ్వరుడైన ఆ తండ్రి. మార్కెట్లో ఉన్న మంచి కార్ల గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసిన ఫ్రెండ్ బీఎండబ్ల్యూ బావుందని చెప్పాడు. దాంతో నిమిషాల్లో కారుని తీసుకు వచ్చి కొడుకు ముందు వుంచాడు. ఆ కారుని చూసి కొడుకు సంతోషిస్తాడు కదా అనుకుంటే నీరు కారిపోయాడు.

అదేమంటే నాకు ఆ కారు నచ్చలేదు అని చల్లగా చెప్పాడు. తండ్రి కోపంతో కుత కుతా ఉడికి పోయాడు. ఒకటి కాదు రెండు కాదు రూ.35 లక్షలు పోసి కొన్న కారు నచ్చలేదంటావా అని అరిచాడు. అంతే.. నాన్న మీద కోపంతో కొడుకు కారుని తీసుకెళ్లి ప్రవహించే నదిలో పడేశాడు. కారు నది మధ్యలో చిక్కుకు పోయింది. దీంతో అతగాడి కోపం కూడా చల్లారిపోయింది. తప్పు తెలుసుకుని కారుని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించాడు. తన వల్ల కాకపోవడంతో స్థానిక గజ ఈతగాళ్ల సాయం తీసుకున్నాడు. ఎట్టకేలకు కారుని బయటకు తీసుకురాగలిగాడు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. సదరు యువకుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story