రైలు నుంచి జారి పడ్డ వృద్ధుడు.. పరిస్థితి విషమం..
By - TV5 Telugu |11 Aug 2019 7:57 AM GMT
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి కాలు జారి కింద పడ్డాడు ఓ వృద్ధుడు. చీరాలకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు తిరుపతి నుంచి ట్రైన్లో చీరాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దురదృష్టవశాత్తూ కాలు జారీ కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు హుటాహుటిన క్షతగాత్రుడ్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com