రైలు నుంచి జారి పడ్డ వృద్ధుడు.. పరిస్థితి విషమం..

రైలు నుంచి జారి పడ్డ వృద్ధుడు.. పరిస్థితి విషమం..

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు నుంచి కాలు జారి కింద పడ్డాడు ఓ వృద్ధుడు. చీరాలకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు తిరుపతి నుంచి ట్రైన్‌లో చీరాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దురదృష్టవశాత్తూ కాలు జారీ కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు హుటాహుటిన క్షతగాత్రుడ్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story