కామ మృగాలు.. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

కామ మృగాలు..  బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

వరంగల్‌లో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్‌ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే..15 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. దీంతో ఆ అవమానం భరించలేని బాలిక.. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

నిందితుల్లో పెంబర్తి గ్రామానికి చెందిన రాజేష్‌, తిరుపతి, బిట్టుగా పోలీసులు గుర్తించారు. అత్యాచార నిందితుల్లో ఓ ప్రజాప్రతినిధి తమ్ముడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. డిజె ద్వారా బాలికను పరిచయం చేసుకున్న రాజేష్‌ అనే యువకుడు.. గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లిన రాజేష్‌... స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ గ్యాంగ్‌ రేప్‌ జిల్లాలో కలకలం రేపింది. అవమానం భరించలేని బాలిక.. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రవీణ్‌లాగే ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులకు కూడా ఉరిశిక్ష విధించాలని మహిళా, విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story