దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం
By - TV5 Telugu |15 Aug 2019 4:16 PM GMT
భారత 73 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న కాన్సుల్ జనరల్ విపుల్ జాతీయ జెండాను ఎగురవేశారు. వేడుకల్లో వెయ్యి మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రమేష్ ఏముల, రవి ఉట్నూరి, నరేష్ కుమార్ మన్యం, భరద్వాజ్, శ్రీకాంత్ చిత్తర్వు, కంబాల మహేందర్ రెడ్డి, షేక్ అహ్మద్ షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com