రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది - కిషన్రెడ్డి
By - TV5 Telugu |17 Aug 2019 3:32 PM GMT
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్ బన్సీలాల్ పేట డివిజన్ బండమైసమ్మ బస్తీలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన పాల్గొన్నారు. పేదలకు డబల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇవ్వలేక పోయారని దీంతో ఇల్లులేని పేద ప్రజలు అవస్తలు పడుతున్నారన్నారు. బన్సీలాల్ పేటలోని 450 కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టివాలని ఆయన డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయాలని కిషన్ రెడ్డి సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com