చంద్రబాబు వద్ద గోడు వెళ్లబోసుకున్న వరద బాధితులు

X
By - TV5 Telugu |21 Aug 2019 6:05 PM IST
గుంటూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలోని వెల్లటూరు, కిష్కింద పాలెం, జువ్వలపాలెంలో బాధితులను ఆయన పరామర్శించారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. ఇంకా నీటిలోనే మునిగి ఉన్న పంటలను పరిశీలించారు. పసుపు, మిర్చి, కంద, అరటి, పూల తోటల రైతులను చంద్రబాబు పరామర్శించారు.
ఇప్పటికీ వరదలో నానుతున్న తమ గ్రామాలకు ఇంతవరకు మంత్రులు కాని, అధికారులు కానీ రాలేదని.. తమ గోడు పట్టించుకోలేదని బాధితులు అన్నారు. చంద్రబాబు వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com