వివాహేతర సంబంధం.. భార్య చేసిన పని చూస్తే..

వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యను నిర్లక్ష్యం చేసిన భర్తను కడతేర్చిందో మహిళ. ఈ ఘటన దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరిగింది. ముంబైలోని నల్లసొపర ప్రాంతంలో నివాసముంటున్న సునీల్(33), ప్రణలికి ఆరేళ్ళ కిందట వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. కొన్నిరోజుల నుంచి సునీల్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతను వేరే మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాపిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్యకు అసలు విషయం తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని పెద్దవాళ్ళతో పంచాయితీ పెట్టించింది.
అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. భర్తపై విపరీతమైన కోపాన్ని పెంచుకున్న ప్రణలి.. అతను నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేసింది. సునీల్ కడుపులో 11 సార్లు పొడిచి, ఆ తర్వాత గొంతు కోసింది. అనంతరం తన భర్తే పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు చెప్పింది. అయితే ఆమె చెప్పేదానిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దాంతో భర్తను తానే చంపినట్లు అంగీకరించింది ప్రణలి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com