రాజధాని అమరావతికి అప్పుడు జగన్‌ అంగీకరించారు - ఏపీ బీజేపీ అధ్యక్షుడు

రాజధాని అమరావతికి అప్పుడు జగన్‌ అంగీకరించారు - ఏపీ బీజేపీ అధ్యక్షుడు

రాజధాని రైతులతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలిస్తుందన్న ప్రచారం నేపథ్యంలో రాజధాని రైతులతో కన్నా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కన్నా లక్ష్మీనారాయణ.

రాజధానిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదని విమర్శించారు. రాజధాని అమరావతికి అప్పుడు జగన్‌ అంగీకరించారని కన్నా గుర్తు చేశారు. తమ ప్రాంతంలో రాజధాని వస్తుందని ఆశతో.. మూడు పంటలు పండే పొలాలను రైతులు త్యాగం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక కొందరి కోసమే వైసీపీ పని చేస్తున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు కన్నా.

ఇప్పటికే వేలాది కోట్లు రాజధాని నిర్మాణానికి వెచ్చించారని కన్నా తెలిపారు. రాజధానిపై ముఖ్యమంత్రి జగన్‌ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ.

Tags

Read MoreRead Less
Next Story