అతడి వెనుక ఎవరున్నారో తేల్చాలి : కోడెల డిమాండ్
సత్తెనపల్లిలోని తన ఆఫీసులో జరిగిన కంప్యూటర్ల చోరీ ఉదంతంపై ఏపీ మాజీ సభాపతి కోడెల స్పందించారు. గుంటూరు వైసీపీ కార్యాలయంలో పని చేసే అర్జున్ అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై డీఎస్పీతో మాట్లాడానని చెప్పారు. కంప్యూటర్ పరికరాలను ఎందుకు తీసుకెళ్లాడో, అతడి వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు..తనపై కక్షతోనే అధికార పక్షం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనిని ఓ దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
అసెంబ్లీ ఫర్నీచర్ దుర్వినియోగం అవుతోందంటూ వస్తున్న వార్తలను కోడెల ఖండించారు. అసెంబ్లీలో ప్రతి వస్తువుకు లెక్క ఉంటుందని చెప్పారు. కొందరు వ్యక్తులు ఫర్నిచర్ చోరీ, దుర్వినియోగం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఖాళీ లేదంటేనే ఫర్నీచర్ను తమ ఆఫీసులో భద్రపరిచారని స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com