అరుణ్ జైట్లీ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు
By - TV5 Telugu |24 Aug 2019 10:31 AM GMT
అరుణ్ జైట్లీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను అని చంద్రబాబు ట్విట్ చేశారు. వాజ్ పేయి, నరేంద్రమోదీ మంత్రివర్గాల్లో న్యాయ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణల కోసం కృషి చేశారు. ఆయన మృతి బీజేపీకే కాకుండా మొత్తం దేశానికే తీరనిలోటని పేర్కొన్నారు చంద్రబాబు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com